'అదంతే నాకదో తుత్తి' డైలాగ్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమ్యాడు. 'రంగుపడుద్ది' అని నవ్వించినా 'గాలి కనిపిస్తోందా' అంటూ ప్రశ్నల వర్షం కురిపించినా 'మీది తెనాలే.. మాది తెనాలే' అంటూ చిందులేసినా.. అది ఆయనకే చెల్లింది. ఆయనే ప్రముఖ హాస్య నటుడు ఏవీఎస్. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ ఒక నవ్వులరేడును కోల్పోయింది. ఆయన హఠాన్మరణంతో పరిశ్రమ వర్గాలు దిగ్భాంత్రికి గురయ్యాయి. కొంతకాలంగా అనారోగ్యం... ఏవీఎస్ గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఏవీఎస్(56)కు ఆయన కుమార్తె కాలేయాన్ని దానం చేశారు. ఆ తరువాత ఆయన ఆరోగ్యం కొంత మెరుగుపడింది. కొంతకాలానికి ఆరోగ్యం మళ్లీ విషమించింది. దాంతో ఆయన కొద్దిరోజులు హైదరాబాద్లోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే శుక్రవారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఆయనను డిశ్చార్జ్ చేశారు. దీంతో.. See More....
No comments:
Post a Comment